రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలోని పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ముందే వివాదాస్పద సినీ విమర్శకుడు ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తన సోషల్ మీడియా ఖాతాలో ‘పెద్ది’ చిత్రంపై స్పందించిన ఉమైర్ సంధు, సినిమాను “బోరింగ్”గా అభివర్ణిస్తూ కేవలం 2 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. కథనం, నటీనటుల ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నాడు. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమైర్ సంధు గతంలో కూడా అనేక పెద్ద సినిమాలపై విడుదలకు ముందే నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం, వాటిలో చాలావరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడం తెలిసిందే. అందుకే అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కేవలం ప్రచారం మరియు అటెన్షన్ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని విమర్శిస్తున్నారు.
ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, పలు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.
అయితే ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు నిజమా? లేక మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలనే ప్రయత్నమా? అనే విషయం సినిమా విడుదల తర్వాతే తేలనుంది.
